అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ చరిత్ర సృష్టించింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడుతున్న టీమిండియా, పవర్ప్లే ఓవర్లలో కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగిపోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడి, పవర్ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 92 పరుగులు సాధించారు. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పవర్ప్లే స్కోరుగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.