భక్తురాలి మెడలోంచి నాలుగు తులాల పుస్తెలతాడు అపహరణ...

Dec 9, 2022, 5:35 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తురాలి మెడలోంచి నాలుగు తులాల పుస్తెలతాడు చోరీ అయ్యింది. వృద్ధురాలైన భక్తురాలికి గుర్తుతెలియని మహిళ ఒకరు ఫ్రూట్ జ్యూస్ లో మత్తుమందు కలిపిచ్చి,  పుస్తెలతాడు అపహరించింది. కరీంనగర్ జిల్లా కేశవ పట్టణం  మండలం తాడికల్ గ్రామానికి చెందిన సరోజన ఆలయ అధికారులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు.  సిసి ఫుటేజ్ ఆధారంగా పుస్తెలతాడు అపహరించిన మహిళను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులు గుర్తుతెలియ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.