మావోల ప్రాబల్యం తగ్గించాం: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ (వీడియో)

Aug 27, 2019, 12:04 PM IST

అంతరాష్ట్ర మండలి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  మావోయిస్టులను అణచివేసినట్టుగా ఆయన ఈ సమావేశంలో చెప్పారు. తమ ఉనికిని చాటుకొనేందుకు కొందరు మావోలు అప్పుడప్పుడు  కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రంలో మావోల ప్రాబ్యలాన్ని తగ్గించేందుకు తాము పలు వ్యూహలను అనుసరిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన వివరించారు.