మానుకొండూరులో ఘోరం... ఆర్టిసి బస్సు ఢీకొని మహిళా కూలీల దుర్మరణం

మానుకొండూరులో ఘోరం... ఆర్టిసి బస్సు ఢీకొని మహిళా కూలీల దుర్మరణం

Published : Nov 30, 2022, 10:07 AM IST

కరీంనగర్ : ఆర్టిసి బస్సు ఢీకొని ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందిన విషాద ఘటన కరీంనగర్  జిల్లాలో చోటుచేసుకుంది.

కరీంనగర్ : ఆర్టిసి బస్సు ఢీకొని ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందిన విషాద ఘటన కరీంనగర్  జిల్లాలో చోటుచేసుకుంది. మానుకొండూరుకు చెందిన నిరుపేద మహిళలు పస్తం లచ్చవ్వ(32),  కడమంచి రాజవ్వ(35) దినసరి కూలీలుగా పనిచేసేవారు. రోజూ మాదిరిగానే ఇవాళ(బుధవారం) కూడా ఉదయమే కూలీపనులకు వెళుతున్న వీరిని ఆర్టిసి బస్ రూపంలో మృత్యువు కబళించింది. మానుకొండూరులోని కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పక్కనగల హోటల్లో టీ తాగి నడుచుకుంటూ వెళుతున్న మహిళలను వేగంగా దూసుకొచ్చిన ఆర్టిసి బస్సు ఢీకొట్టింది. దీంతో లచ్చవ్వ, రాజవ్వ అక్కడికక్కడే మృతిచెందారు.  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతుల వివరాలు సేకరించి కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

47:07Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu
74:37KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
23:32Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu