ఈఎంఐలు చెల్లించలేదని.. దాడికి దిగిన సిబ్బంది..

Jun 4, 2020, 3:47 PM IST

సోమాజిగూడ బజాజ్ ఫైనాన్స్ కార్యాలయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈఎంఐలకు మారటోరియం ఇచ్చిన నేపథ్యంలో వినియోగదారులు లోన్లు చెల్లించడం లేదు. అయితే ఈఎంఐ చెల్లించని వారి ఇళ్ల వద్దకు వెళ్లి సిబ్బంది బలవంతంగా వసూళ్లకు పాల్పడుతుండడంతో బాధితులు 
కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.