Telangana MLC Elections 2021: ఓటేసిన మంత్రులు కేటీఆర్, హరీష్

Dec 10, 2021, 4:08 PM IST

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ(శుక్రవారం) ఆరు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్, గంగుల కమలాకర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇంతకాలం క్యాంపులో వున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రత్యేక బస్సుల్లో నేరుగా పోలింగ్ కేంద్రాలను వచ్చి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.