సొంతూరులో పల్లెనిద్రలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్

Feb 20, 2020, 3:13 PM IST

రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సొంతూరు పెద్ద తండాలో పల్లె నిద్ర చేసి పొద్దునే పల్లె ప్రగతి పనులు పర్యవేక్షించారు. కరెంటు, త్రాగునీరు సమస్య లేకుండా, ఇళ్ళులేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వంటి వాటితో తండా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీసీ రోడ్ తొందరగా శాంక్షన్ చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. పల్లె ప్రగతిలో భాగంగా నర్సరీ ని కూడా అభివృద్ధి చేసారు.