ఏపీ, తెలంగాణల్లో భగ్గుమంటున్న సూర్యుడు, ఏం చేయాలి? (వీడియో)

May 27, 2020, 11:21 AM IST

ఒకవైపు కరోనా మరోవైపు ఎండలు రెండు రాష్ట్రాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వేడి తీవ్రత, వడగాలులతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. 20 యేళ్ల క్రితం భాగ్యనగరంలో 30 డిగ్రీలుండే ఎండ ఇప్పుడు 43 డిగ్రీ లకు టచ్ ఐందంటేనే ఎండ ప్రభావం ఎంతగా ఉందో తెలుసుకోవచ్చు. తుఫాన్ కారణంగా వాతావరణంలోని తేమ తగ్గడం, వెంటనే రోహిణి కార్తీ రావడంతో పరిస్థితి ఇంకా నిప్పులకొలిమిలా తయారయింది. ఇంత వేడిని మన శరీరం తట్టుకోలేదు.. అందుకే ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలో.. ఈ వీడియోలో చూడండి..