గుంటూరులో ఎన్ఐఏ సోదాలు... రహస్య ప్రాంతానికి పిఎఫ్ఐ సభ్యుల తరలింపు

Sep 22, 2022, 10:26 AM IST

గుంటూరు: తెలుగు రాష్ట్రాలో ఇవాళ తెల్లవారుజామునుండి ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అనుమానంతో పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్యాలయాలతో పాటు అనుబంధ సంస్థల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఇలా గుంటూరులో కూడా కేంద్ర బలగాల భద్రతలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. కొందరు పీ.ఎఫ్.ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న ఎన్.ఐ.ఏ. రహస్య ప్రాంతానికి  తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.