ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా

Nov 24, 2019, 11:32 AM IST

జనగామ జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో కారు డ్రైవర్ పార్ధసారది, మంత్రి సోషల్ మీడియా ఇంచార్జీ పూర్ణ మృతిచెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి దయాకరరావు హైదరాబాద్ నుండి పాలకుర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.