లాయర్ దంపతుల హత్యకు ముందు... పుట్టా మధుతో కలిసున్న కుంట శ్రీను

Feb 18, 2021, 11:03 AM IST

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామం దగ్గరలో పట్టపగలే నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులపై కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హతమార్చారు. ఈ దారుణానికి పాల్పడింది  కుంట శ్రీను అని రక్తపు మడుగులో పడివున్న సమయంలో వామనరావే తెలిపారు. దీంతో ఈ శ్రీను ఎవరో కాదు... టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే,పెద్దపెల్లి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు అనుచరుడు. న్యాయవాదుల దంపతుల హత్యకు కొద్ది నిమిషాల ముందే పుట్ట మధుతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు శ్రీను.  ఈ పోగ్రామ్ నుంచి నేరుగా హత్య చేయడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. నిందితుడిగా అనుమానిస్తున్న ఈ శ్రీను ప్రస్తుతం రామగిరి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా వున్నాడు.