
హైదరాబాద్ కోఠి ప్రాంతంలో జరిగిన కాల్పులు, లక్షల రూపాయల చోరీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. కోఠి ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.