May 5, 2020, 11:52 AM IST
సోమవారం సాయంత్రం భారీగా వీచిన ఈదురుగాలులకు కోహెడ మార్కెట్ నేలమట్టమయింది. ఈ దుర్ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. 18 మంది బాధితులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 12 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కోహెడలో గంటకు 83.52 కిలోమీటర్ల వేగంతో గాలి వీచిందని వాతావరణ శాఖ తెలిపింది.