Galam Venkata Rao | Published: Mar 23, 2025, 8:00 PM IST
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతకు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని, ఆ డబ్బునే ఎన్నికల్లో వినియోగించారని ఆరోపించారు. ఇలా కొందరు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని, తెలంగాణ మాత్రం ఆర్థికంగా నష్టపోయిందని విమర్శించారు. దొంగ నోట్ల ప్రింటింగ్ విషయాన్ని స్వయంగా ఓ పోలీస్ అధికారి తనకు చెప్పారన్నారు