
రీజనల్ రింగ్ రోడ్డుకు భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. పెద్దల భూములను వదిలి పేదలు, రైతుల భూములనే కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశంపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.