వ్యవసాయ క్షేత్రంలో సేద తీరుతున్న మంత్రి సింగిరెడ్డి

Mar 22, 2020, 4:15 PM IST

ప్రధాని పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పాన్‌గల్‌‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా అమలవుతున్న జనతా కర్ఫ్యూలో తాము  కూడా భాగస్వాములం అవుతున్నామన్నారు. ప్రజలందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనల్ని మనం కాపాడుకుందామని సింగిరెడ్డి పిలుపునిచ్చారు.