పోటాపోటిగా కాంగ్రెస్, టీఆర్ఎస్ ‘చలో మల్లారం’.. మంథనిలో శ్రీధర్ బాబు అరెస్ట్..

Jul 26, 2020, 5:37 PM IST

భూపాలపల్లి జిల్లా మల్లారంలో ఇటీవల జరిగిన దళిత యువకుడి హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో మల్లారం యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంథని నుంచి కాన్వాయ్‌తో బయలుదేరగా పోలీసులు అడ్డుకుని మంథని స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 6న మల్లారంలో చనిపోయిన దళితుడు రేవెళ్లి రాజబాబు చనిపోవడంతో రేగిన వివాదం టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో నిజనిర్థారణ కోసం ఇరు పార్టీలు పోటాపోటీగా ఛలో మల్లారం పిలుపునిచ్చాయి.