కార్మిక లోకానికి నాయిన... నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత...

Oct 22, 2020, 1:22 PM IST

తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి ఎనభయేళ్ల వయసులో బుధవారం అర్ధరాత్రి తరువాత కన్నుమూశారు. కోవిద్ బారిన పడిన ఆయన దాన్నుండి కోలుకున్నా.. ఆ తరువాతి ఆరోగ్య సమస్యలకు బలయ్యారు.