పల్లెప్రగతి.. వరిమడిలో నారుకు విత్తనాలు చల్ల్లిన ఎర్రబెల్లి...

Jun 8, 2020, 2:24 PM IST

పల్లె ప్రగతి లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి జగిత్యాల జిల్లా నర్సింగపూర్ గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి పొలంలో వరి నారు కోసం వేస్తున్న మొలకలను స్వయంగా పొలం మడిలో చల్లారు. స్వతహాగా రైతు అయిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు 
వ్యవసాయ పనులు చేసిన అనుభవం వుంది. ఆ అనుభవంతో మంత్రి ఎర్రబెల్లి అలవోకగా మొలకలను చల్లుతూ ఉంటే, అంతా ఆశ్చర్య పోయారు. అలాగే అక్కడి రైతులతో మాట్లాడిన ఎర్రబెల్లి, నియంత్రిత పంటలను సాగు చేయాలన్నారు. లాభసాటి పంటలతో రైతులు బాగు పడాలని సీఎం కేసిఆర్ పరితపిస్తు న్నారని రైతులకు చెప్పారు.