విక్టరీ సింబల్ చూపిస్తూ చిరునవ్వుతో... ఈడి ఆఫీస్ నుండి బయటకు కవిత

Mar 21, 2023, 11:04 AM IST

న్యూడిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం మరోసారి ఈడి విచారించనుంది. డిల్లీ లిక్కర్ స్కాం లో కీలకంగా వ్యవహరించిన సౌత్ గ్రూప్ లో ప్రధాన పాత్ర కవితదే అని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న(సోమవారం) కవితను ఉదయం నుండి రాత్రివరకు ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారించింది. ఉదయం భర్త అనిల్ తో కలిసి ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత రాత్రి 9.15 నిమిషాలకు బయటకు వచ్చారు.సుదీర్ఘ విచారణ అనంతరం ఈడి కార్యాలయం నుండి బయటకు వచ్చిన కవిత విక్టరీ సింబల్ చూపుతూ చిరునవ్వుతో కారెక్కారు. తనకు మద్దతుగా ఈడీ కార్యాలయానికి వచ్చిన బిఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ అక్కడినుండి వెళ్లిపోయారు.