మహబూబ్ నగర్ ఆస్పత్రిలో కరోనా ప్రత్యేకవార్డు

Mar 5, 2020, 4:37 PM IST

మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కరోన ప్రత్యేక వార్డ్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్ రావులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోన వైరస్ పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. పుకార్లను నమ్మొద్దని, ఎవరైనా పుకార్లు పుట్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.