చిలుకూరు బాలాజీ ఆలయంపై వదంతులు నమ్మొద్దు.. రంగరాజన్

Jun 13, 2020, 12:57 PM IST

జూన్ ఎనిమిదిన దేశవ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నా చిలుకూరు దేవాలయం తెరుచుకోలేదని దేవాలయ ప్రధానార్ఛకులు రంగరాజన్ తెలిపారు. గూగుల్ లోకి చూసి ఆలయం తెరిచి ఉందని భక్తులు వస్తున్నారని, అయితే ఆలయం తెరవలేదని గూగుల్ ని కాదు పంతులును నమ్మండి అంటూ విన్నవించారు. స్వామివారి ఆరాధన ఏకాంతంగా జరిగుతుందని తెలిపారు. దేవాలయం తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు భక్తులకు అనుమతి లేదని తెలిపారు.