పవన్ కల్యాణ్ వెంటే.. అంటున్న చిలుకూరు ఆలయ పూజారి..

Sep 11, 2020, 2:54 PM IST

హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాలను దగ్ధం చేయడం వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని ఆడపడుచులందరూ మన ధర్మాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అంతర్వేదిలో రథం దగ్ధమవ్వడం, దాడులకు నిరసనగా ధర్మాన్ని పరిరక్షించాలని సంకల్పం చెప్పుకొంటూ ఆడపడుచులు హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. అయితే పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుకు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్  మద్ధతు పలికాడు.