బండి సంజయ్ పిలుపు... రంగంలోకి దిగిన స్వామిగౌడ్

Dec 14, 2020, 2:57 PM IST


హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ఉద్యోగులకు డిఆర్సీ, డీఏలు మంజూరు చేయాలని, వెంటనే ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. దీంతో రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్ల వద్ద బిజెపి శ్రేణులు ఆందోళనకు దిగాయి. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద  శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ ఆందోళనలో పాల్గొననున్నారు.