ఛలో అసెంబ్లీ : ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ..పరిస్థితి ఉద్రిక్తం

Mar 11, 2020, 4:42 PM IST

విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ  ఏబీవీపీ  బుధవారం నాడు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు.