తాత తవ్విన బోరు బావే బాలుడిని మింగింది

May 28, 2020, 3:16 PM IST

అప్పటిదాకా తాత చేయి పట్టుకొని తిరిగిన మూడున్నరేళ్ల సాయి వర్ధన్ బోరుబావిలో తొంగిచూస్తూ జారిపడిపోయాడు ,తాత డాడీ అని కేకలు వెయ్యడంతో  అందరు అతడిని కాపాడడానికి ఆరాటపడడ్డారు. తాత తన దోతిని  బావిలోకి వదిలి మనవడిని కాపాడే ప్రయత్నం చేసాడు .తెలంగాణలోని పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లిలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడుని రక్షించటానికి హైదరాబాద్ నుండి వచ్చిన ముప్ఫయి మంది  రెస్క్యూ , ఎన్డీఆర్ఎఫ్ సిబ్భంది చేసిన ప్రయత్నం వృధా అయ్యింది. దాదాపు 12 గంటల పాటు చేపట్టిన  ఆపరేషన్ విఫలమైంది. 17 అడుగుల లోతులో  నుంచి గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశాయి.