Feb 18, 2020, 8:15 AM IST
మాజీ భారతీయ జనసంఘ్ నాయకుడు పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ 63 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలోని చందౌలిలో ప్రారంభించారు. పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ మెమోరియల్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ వారణాసిలో ఒకే రోజు 30 కి పైగా ప్రాజెక్టులను ప్రారంభించారు.