పెరిగిన రైతుల ఆత్మహత్యలు : నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక

Jan 14, 2020, 1:10 PM IST

2018 ఒక్క సంవత్సరంలోనే 10వేల 349మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన యాక్సిడెంట్లలో మరణించిన, ఆత్మహత్యలు చేసుకున్నవారి డేటా ప్రకారం ఈ వివరాలు తెలిసాయి.ఈ నివేదిక ప్రకారం, మహారాష్ట్ర లో 17,972 అత్యధిక ఆత్మహత్యలు జరిగాయి. తమిళనాడులో 13,896, పశ్చిమ బెంగాల్ లో 13,255, మధ్యప్రదేశ్ లో 11,775, కర్ణాటకలో 11,561 ఆత్మహత్యలు నమోదయ్యాయి.