ఆస్పత్రుల ముందు ధర్నాలకు పిలుపు.. బిజీపీ నేతల ముందస్తు అరెస్టులు..

Jun 22, 2020, 12:12 PM IST

తెలంగాణలో ఆస్పత్రుల ముందు ధర్నాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.  ఈ క్రమంలో Mlc రాంచందర్ రావును తార్నకలోని తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇంటిముందు భారీగా పోలీసులు మోహరించారు. కోఠి డీఎంఈ కార్యాలయంను బీజేపీ కార్యకర్తలు ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బండి సంజయ్ సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.