సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించిన తలసాని ట్రస్టు..

May 28, 2020, 3:10 PM IST

సినీ కార్మికుల కోసం మంత్రి తలసాని ట్రస్ట్ కింద 14 వేల కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాల కిట్ల పంపిణీ ఈరోజు జరిగింది. ఈ కిట్స్ ట్రక్కులను మారేడ్‌ పల్లిలో తలసాని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వీటిని ఫిల్మ్ నగర్ లో నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, ఎన్ శంకర్, దిల్ రాజుల చేతుల మీదుగా సినీ కార్మికులకు అందజేశారు.