వైఎస్ జగన్ తో భేటీకి గన్నవరం చేరుకున్న చిరంజీవి టీమ్

Jun 9, 2020, 1:01 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను  కలిసేందుకు సినీ ప్రముఖులు బృందం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరపడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమబృందం అక్కడికి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బృందంలో హీరోలు చిరంజీవి , నాగార్జున , దర్శకులు రాజమౌళి , నిర్మాతలు డి.సురేష్ బాబు ఉన్నారు.