యువత కేరింతలు, భారీ జనసందోహంతో ... విజయవాడలో ఘనంగా జయహో బీసి సభ

Dec 7, 2022, 3:49 PM IST

విజయవాడ : వైసిపి ప్రభుత్వం చేపట్టిన జయహో బీసి సభకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు జరిగాయి. బీసీలకు జగన్ సర్కార్ అందించిన సంక్షేమం గురించి తెలియజేయడమే కాదు ఈ సభ ద్వారా బీసీల కష్టాలు తేలుసుకునేలా అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రతి బీసి కులానికి ఈ సభలో ప్రాతినిధ్యం వుండేలా చూస్తున్నారు... ఇలా 139 బీసీ కులాలతో సభా నిర్వహణ చేపడుతున్నారు. ఇప్పటికే సభాప్రాంగణానికి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. బిసీ యువతీయువకుల కేరింతలతో సభా ప్రాంగణంలో సందడి నెలకొంది. 

జయహో బీసీ మహాసభ... వెనుకబడిన కులాలే వెన్నెముక! పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ షభలో  సీఎం జగన్ తో పాటు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి ఒక్కొక్కరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు.