తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న 2.0లో కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. కూటమి పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి అధికారులతో సెల్యూట్ కొట్టిస్తానని చెప్పారు.