అప్పుల బాధతో... పురుగుమందు తాగి యువరైతు ఆత్మహత్య

Feb 19, 2021, 10:12 AM IST

గుంటూరు: వ్యవసాయం కోసం అప్పులు తీర్చలేక ఓ యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. దాచేపల్లి మండలం తక్కెళ్లపాడుకు చెందిన తేలుకుట్ల మల్లయ్య ఇతరుల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇలా అతడు కౌలు కోసం, వ్యవసాయం కోసం ఎనిమిది లక్షలు అప్పులు చేశాడు. కానీ పంట సరిగ్గా పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేకుండా పోయింది. దీంతో పొలం వద్దే పురుగులమందు తాగా బలవన్మరణానికి పాల్పడ్డాడు.