కాకినాడలో దారుణం...మహిళ వాలంటీర్ పై వైసిపి కార్యకర్తలు దాడి

Dec 16, 2020, 5:48 PM IST

కాకినాడ: తనపై వైసిపి కార్యకర్తలు దాడి చేసారంటూ ఓ మహిళా వాలంటీర్ ఉన్నతాధికారులను ఆశ్రయించింది. వార్డు వాలంటీర్ చీకోటి శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్తపై అనుమానం పెంచుకుని వైసిపి కార్యకర్తలు ఇవాళ దాడికి పాల్పడ్డారు. ఇలా వారిపై దాడికి పాల్పడినప్పుడు తీసిన కొన్ని వీడియోలను బాధిత మహిళ మీడియా కు అందచేసింది.