వైసీపీ నేత, విశాఖ డెయిరీ డైరెక్టర్ పై వెంటాడి, వేటాడి కత్తులతో దాడి..

Jun 4, 2020, 10:20 AM IST

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడి గ్రామానికి చెందిన విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణపై కొందరు దుండగులు వెంటాడి వెంటాడి మరీ కత్తులతో దాడి చేశారు. అదే గ్రామానికి చెందిన 8 మంది దుండగులు కత్తులతో వెంటాడి మరీ దాడి చేశారు. గ్రామంలోని తులసి కల్యాణ మండపం సమీపంలో తన అనుచరులతో కలిసి జాగింగ్ చేస్తండగా  ఈ దాడి జరిగింది. ఇద్దరు అనుచరులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో టీడీపీలో ఉన్న సత్యనారాయణ ఈ మధ్యే వైసీపీలో చేరారు. అయితే ఈ దాడి వైసీపీ వర్గాలే చేశాయని అంటున్నారు.