చంద్రబాబు, జగన్ దొందూ దొందే ...సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

Feb 5, 2020, 1:35 PM IST

విశాఖ మధురవాడ మిధిలా పూర్ కాలనీలో సర్వేనెంబర్ 296/6  భూమిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో భూ ఆక్రమణలపై జ్యూడిషియల్ విచారణ చేయించాలని, భూ కుంభకోణం విచారణలో చంద్రబాబు, జగన్ దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్  గా చెబుతున్న పరిసర ప్రాంతాల్లో 2వేల ఎకరాల భూమి కబ్జా గురైంది. ల్యాండ్ పూలింగ్ విధానం సరికాదు..అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ అయితే విశాఖలో కాదా అంటూ అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులనే వైసీపీ ప్రభుత్వం కాపీ కొడుతోందని మండిపడ్డారు.