ఎమ్మార్వో మల్లేశ్వరికి అమరావతి సెగ

Feb 19, 2020, 4:17 PM IST

కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకు రాజధానిలో ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయంపై అమరావతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు వెంకటపాలెంలో భూముల పరిశీలనకు వచ్చిన దుగ్గిరాల ఎమ్మార్వో మల్లేశ్వరిని గ్రామస్తులు అడ్డుకున్నారు. రాజధాని ఆందోళనలు, కోర్టులో కేసులు ఉన్నప్పుడు స్థలాలు ఎలా ఇస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.