ప్రజావేదిక వద్ద తేదేపా నేతల అరెస్టు

Jun 25, 2020, 12:09 PM IST

ఉండవల్లిలో వైసీపీ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చి ఏడాది అయిన సందర్భంగా టీడీపీ నేతలు భారీ సంఖ్యలో నిరసన తెలపడానికి అక్కడికి చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. ప్రజావేదిక వద్దకు వచ్చే నాలుగు రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తేదేపా నేతల వాహనాలను అనుమంతించలేదు. దేవినేని ఉమ, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర కరకట్ట వద్దకు చేరుకున్నవారిలో ఉన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.