సిఆర్ డిఏ ఆఫీస్ ముందు బైఠాయించి... టిడిపి శ్రేణులు, అమరావతి రైతుల ఆందోళన

Jun 22, 2022, 2:42 PM IST

గుంటూరు: కౌలు రైతులకు నాలుగు నెలల నుంచి చెల్లించాల్సిన పెన్షన్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరులోని సిఆర్ డిఏ ఆఫీస్ ఎదుట తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులతో పాటు రైతులు, రైతు కూలీలు ఆందోళనలో పాల్గొన్నారు. తుళ్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి సి ఆర్ డిఏ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఆర్ డిఏ ఆఫీస్ ఎదుటే నిరసనకారులంతా భోజనాలు చేసారు.