ఏపీ అంబులెన్సుల కుంభకోణం.. విజయసాయిరెడ్డి అల్లుడికే... వాసుపల్లి గణేష్

Jul 1, 2020, 4:36 PM IST

104, 108 అంబులెన్స్ ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి అల్లుడి సంస్థకు లాభం చేకూరేలా ఇదంతా జరిగిందని అన్నారు. అరబిందో సంస్తకు ఎలాంటి భారం లేకుండా ప్రభుతమే ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ డబ్బులు ఆదా చేస్తున్నామని చెబుతూ తమకు అనుకూలమైనవారికి కట్టబెడుతూ రిజర్వ్ టెండరింగ్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అంబులెన్స్ అంటే కదిలే హాస్పిటల్.. అలాంటి దాన్ని ఇద్దరు వ్యక్తులకు పరిమితం చేసి నిర్వీర్యం చేశారన్నారు.