జస్టిస్ రామకృష్ణపై వైసీపీ కార్యకర్తలు దాడి దారుణం.. నిమ్మకాయల చినరాజప్ప

Jul 17, 2020, 3:07 PM IST

జస్టిస్ రామకృష్ణపై  వైసీపీ కార్యకర్తలు దారుణంగా  దాడి చేశారని.. ప్రశ్నిస్తే ఇలా దాడులు దిగుతున్నారని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప జగన్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత  సామాన్యుల నుంచి పెద్దల వరకు అందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  అక్రమ కేసులు బనాయించి  కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. బీసీ, ఎస్సీలను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారన్నారు.