అంబేద్కర్ ఫోటోను తొలగించి సీఎం జగన్ ఫోటో...కృష్ణాజిల్లాలో సచివాలయ సిబ్బంది నిర్వాకం

Jun 21, 2022, 5:37 PM IST

కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం రామనపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సచివాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడంపై గ్రామస్తుల ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించి ఆ స్థానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో పెట్టడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనతో దిగివచ్చిన సచివాలయ సిబ్బంది ముఖ్యమంత్రి ఫోటో తీసివేసి తిరిగి యధాస్థానంలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.