జగనన్న పాలన సూపర్ ... మళ్లీ ఆయనే సీఎం : పించన్ తీసుకుంటూ వృద్దుడి భావోద్వేగం

Mar 1, 2023, 11:41 AM IST

అమరావతి : ఏదేమైనా సరే ప్రతి నెలా ఫస్ట్ వచ్చిందంటే  వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ చేపడుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇలా ఠంచనుగా పెన్షన్ డబ్బులు అందుతుండటంతో వృద్దులు, వికలాంగులు, వితంతువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఓ వృద్దుడు ఇవాళ పెన్షన్ డబ్బులు అందుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఏ కష్టమూ చేయలేని తనలాంటి వృద్దులకు అండగా జగన్ సర్కార్ ఫించన్ అందిస్తున్నారు... ఇలా ఆయన పాలన చాలా గొప్పగా సాగుతోందని అన్నారు. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారంటూ వృద్దుడు జోస్యం చెప్పాడు.  ఇదిలావుంటే ఇవాళ మార్చి నెల ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సాఆర్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే 63.66 లక్షల మంది పెన్షనర్లకు పంపిణీ చేసేందుకు రూ.1754 కోట్లు విడుదల చేసింది. వాలంటీర్లు ఇవాళ తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.