ఆ అంకెతో చంద్రబాబుకు చిక్కులు..

Sep 22, 2020, 9:46 PM IST

జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో టీడీపీకి గట్టి షాక్ లే తగులుతున్నాయి. జగన్ కు ఎంతగా టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నా.. వరుస కేసులతో జగన్ రిటార్ట్ లిస్తున్నాడు. దీంతో టీడీపీ నేతలకు ఊపిరిపీల్చుకోవడం కష్టంగా మారిపోతోంది. ఎన్నికల తరువాత ఒక్కరొక్కరిగా పార్టీని వీడి జగన్ తో చేతులు కలుపుతున్నారు. అలా ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్యేలు జగన్ కి జై కొట్టారు. అధికారికంగా వైఎస్సార్‌సీపీలో చేరకపోయినా.. మద్దతు పేరుతో దగ్గరవుతున్నారు. తాజాగా విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జగన్‌ను కలిశారు.. తన కుమారులు ఇద్దర్ని దగ్గరుండి అధికార పార్టీలో చేర్పించారు.