పేదలకు ఇళ్ల పట్టాలు : పేదల దగ్గర లాక్కుని.. పేదలకే పంచుతారా.. టీడీపీ నేత జవహర్..

May 26, 2020, 11:56 AM IST

గుంటూరు జిల్లా, దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో లెదర్ పార్క్ కు సంబంధించిన స్థలాన్ని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత జవహర్ నేతృత్వంలో నిజనిర్థారణకు వెళ్లిన కమిటీని సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనిమీద నేతలు నిరసన వ్యక్తం చేశారు. పేదలదగ్గర తీసుకున్న భూములు పేదలకు పంచడం ఏమిటని ప్రశ్నించారు.