క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు... శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

Mar 8, 2021, 2:53 PM IST

తాడేపల్లి: మహిళ అంటే ఆకాశంలో సగభాగమని.. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళామణులు కుటుంబానికి చుక్కానిలా ఉండి అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవన్నారు సీఎం జగన్.