ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇంటి దొంగల చేతివాటం

Jul 3, 2020, 3:41 PM IST

కర్నూలు జిల్లా, శిరివెళ్ళ మండలం బోయలకుంట్ల గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తున్న పలువురు సిబ్బంది రాత్రి సమయంలో అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది గమనించిన ఓ యువకుడు దీన్ని వీడియో తీసి సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిబంధనలు ఉన్నప్పటికీ పలువురు సిబ్బంది రాత్రి సమయంలో మద్యం సీసాలను ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఈ విషయంలో ఆళ్లగడ్డ ఆప్కారి సీఐ కృష్ణ కుమార్ మాట్లాడుతూ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందే ఈ అక్రమాలకు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని  దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు.