స్పందన కార్యక్రమంలో పెట్రోలు పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం

Mar 2, 2020, 3:10 PM IST

కర్నూల్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఓ రైతు కలెక్టర్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తన నాలుగెకరాల పొలాన్ని అధికారులు వేరే వారి పేరు మీద ఆన్ లైన్ చేశారని...దీనిమీద 12 సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై పూర్తిగా విచారణ చేసి తనకు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు.