ఏపీ పెన్షన్ స్కీం : పెన్షన్ల రద్దుతో రోడ్డెక్కిన వృద్ధులు, వికలాంగులు...

Feb 8, 2020, 9:13 AM IST

విశాఖలో పెన్షన్ లు రద్దైన వృద్ధులు, వికలాంగులు ఆందోళనలో ఉన్నారు. వీరంతా కలిసి విశాఖ జీవీఎమ్సీ గాంధీ విగ్రహం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ర్యాలీగా కమిషనర్ దగ్గరికి వెళ్లి తమ గోడు వినిపిస్తామని చెప్పారు. వీరికి టీడీపీ నేతలు మద్దతు పలికారు. ఈ పెన్షనర్ల నిరసనలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.